How to Reach Istakameswari temple in srisailam full Details 4K HDR |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • How to Reach Istakameswari temple in Srisailam
    Online Tickets and More Details Click here 👇
    🙏 SUBSCRIBE DARLING ❤️
    nstr.co.in/nek...
    www.srisailade...
    • Varahi Devi temple in ...
    Istakameswari temple History 👇👇👇
    #istakameswari
    #istakameswari temple
    #srisailam
    ఇష్టకామేశ్వరి దర్శనం మీ కోరికలు తీరుస్తుంది..
    శ్రీశైలంలో ఇక్కడికి వెళ్లడం చాలా కష్టం.
    భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు.
    శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీశైలం దేవస్థానం ఒకటి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే ప్రజలు మార్గమధ్యంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని వెళుతుంటారు. పురాణ ఇతిహాసాల్లో శ్రీశైలం క్షేత్ర మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైనది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినీ, కాశీ క్షేత్రాల తరువాత దక్షిణ భారతదేశంలో శ్రీశైలం క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధన విధానమంటూ లేదు.
    కాపాలికుల దగ్గర నుంచి వేద శాస్త్రయుత పూజల వరకూ అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో పూజా విధానాలు జరుగుతుంటాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. ఇక్కడి స్థానికుల కధనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు.
    ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునే వారు. పల్లవులు, విజయనగరరాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం.
    భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు.
    పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.
    ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు.
    శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.
    శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తరువాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది. డోర్నాల్ మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాళ్లను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అన్న భయం కూడా కలుగుతుంది. కాకపోతే డ్రైవర్లు ఈ మార్గంలో ఎంతో నేర్పు కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు.
    దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరం కాదు. మార్గ మధ్యంలో జంతువుల అరుపులు, జలపాతాల సవ్వళ్లు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో జీపులను నిలిపి వేస్తారు. జీపు నుంచి కింది దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మరచిపోతారు. అటవీ మార్గంలో ఒక కిలోమీటరు నడక తరువాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. స్థానికులు పర్యాటకులకు అమ్మవారి విశిష్టతను, ఆ ప్రాంత ప్రత్యేకతలను తెలియజేస్తారు.
    రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరించడంతో సాయంత్రం 5 దాటిన తరువాత అడవిలోకి జీపులను అనుమతించరు. కోరిన కోర్కెలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే పర్యాటకులు తప్పక దర్శించాలి.
    🙏 SUBSCRIBE DARLING ❤️

ความคิดเห็น • 87