పుంగనూరు లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్
ఆశ్వీయ అంజూం మృతి అందరినీ కలచి వేసింది
కర్నూలు లో లాగా మళ్ళీ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంది అని శ్రీ వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన ఖరారు చేశారు
శ్రీ వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరు లో పర్యటించారు
పోలీసులు కూడా ముగ్గురు దోషులను అరెస్టు చూపించారు
వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం
ఈ నేపద్యంలో శ్రీ వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది
ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేది
శ్రీ వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రం లో చర్చ మొదలవుతుందని పుంగనూరు ఘటన పై ప్రభుత్వం వేగంగా స్పందించింది
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి
రెడ్ బుక్ రాజ్యంగా అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తుంది
ఇవన్నీ పక్కన పెట్టీ ప్రజలు సంక్షేమం అందిస్తే బాగుంటుంది