👉కేసీఆర్TRSప్రభుత్వంప్రతిష్టాత్మకంగారైతులను ఆర్థికంగాబలోపేతంచేయడానికిరైతులపొలాలకు సాగునీరుఅందించారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి నిర్మించిన కొండపోచమ్మ సాగర్ మరియు మల్లన్న సాగర్ ప్రాజెక్టులలోని హల్దీ వాగు మరియు కూడవెల్లి వాగు సంగారెడ్డి కెనాల్ రామాయంపేట కెనాల్ తుర్కాపల్లి కెనాల్ జగదేపూర్ కెనాల్ లోకి వెంటనే నీళ్లను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సారథ్యంలో సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక నర్సాపూర్ మెదక్ సంగారెడ్డి ఆలేరు రైతులతో కలిసి టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ , కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ల నుండి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలనీ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు ,
    లేనిపక్షంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదలని యెడల ఆగష్టు రెండవ తేదీ రోజున రాజీవ్ రహదారి, తూప్రాన్ జాతీయ రహదారులను పెద్ద ఎత్తున మెదక్, నల్గొండ జిల్లా రైతులతో, ప్రజాప్రతినిధులతో కలిసి దిగ్బంధం చేస్తామని మాజీ అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు,సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లాన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం సిద్దిపేట జిల్లా రైతాంగం భూములు ఇచ్చి త్యాగాలు చేశారనీ,మల్లన్న సాగర్ నుండి నీళ్ళు వదలడం వల్ల కూడవేళ్లి వాగు ద్వారా 100 కిలోమీటర్ల పైగా దాదాపు అయ్యర్ మానేరు వరకు లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించవచ్చున్నారు, దాదాపు 34 చెక్ డ్యాములను నింపుకొని వాగకుండా ఉన్న పంటలకు సాగునీరును గతంలోని కేసీఆర్ ప్రభుత్వం అందించింది అన్నారు, అదేవిధంగా హల్ది వాగుల ద్వారా వంద కిలోమీటర్ల మేర దాదాపు నిజాంసాగర్ వరకు రైతాంగానికి సాగునీరు అందించవచ్చున్నారు
    రైతులు వరి నాట్లు వేసి ఎదురుచూస్తున్నారన్నారు
    దాదాపు వర్షాకాలం రెండు నెలలు పూర్తి అయిందన్నారు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు
    కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు
    అబద్ధపు మాటలతో అసత్యపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు
    మల్లన్న సాగర్ లో 5 టీఎంసీల నీళ్లు ఉన్న,కొండపోచమ్మ సాగర్ లో మూడు టీఎంసీల నీళ్లు ఉన్న రైతాంగం మొగులకు ముఖం పెట్టి వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టిందన్నారు .
    కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ లో మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్న నీళ్లను విడుదల చేయక రైతులపై కక్ష కట్టిందన్నారు
    కొండపోచమ్మ సాగర్ మరియు మల్లన్న సాగర్ ద్వారా రైతాంగానికి లక్షల ఎకరాలకు సాగు నీళ్ళందుతాయనీ అన్నారు.
    ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి హల్ది వాగు, కూడవెల్లి వాగు, రంగారెడ్డి కెనాల్, రామాయంపేట కెనాల్, జగదేపూర్ కెనాల్, తుర్కపల్లి కెనాల్ నీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు , లేనిపక్షంలో రైతులతో కలిసి మల్లన్న సాగర్ నీళ్లను స్వయంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విడుదల చేస్తామని మరియు కొంటె పోచమ్మ సాగర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నీళ్లనే విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, రైతులకు నీళ్లు అందిస్తామని హెచ్చరించారు,
    గత కెసిఆర్ ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి మండుటెండల్లో సైతం రైతుల పొలాలకు సాగునీరు అందించిన ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారిది అన్నారు, గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు సాగునీరు రైతు నాట్లు వేసుకున్న వెంటనే అందించడం జరిగిందన్నారు, రైతులకు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ గుండా కూడ వెళ్లి వాగు మరియు హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ వరకు మరియు మానేరు ప్రాజెక్టు వరకు వందల చెక్ డ్యాముల నిర్మాణం చేసి నింపి లక్షల ఎకరాలకు సాగునీరును గత కేసిఆర్ ప్రభుత్వంలో అందించడం జరిగిందని గుర్తు చేశారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి రోజుకో మాటతో పబ్బం గడుపుతూ రైతులకు సాగునీరు అందించక గత ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా పెట్టుకొని రైతులను సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగానికి కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా నీళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో తామే స్వయంగా సాగునీరును మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ నుండి విడుదల చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ , గజ్వేల్ జెడ్పిటిసి పంగా మల్లేశం, గజ్వేల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వుడెం కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కౌన్సిలర్లు కిషన్ రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్ గంగిశెట్టి రవీందర్, మర్కంటి కనకయ్య, కూరాకుల శ్రీనివాస్, అల్వాల బాలేష్ బొగ్గుల చందు నాయకులు హైదర్ పటేల్, పాల రమేష్ గౌడ్,అహ్మద్, గడియారం స్వామి చారి, ఉమర్, తదితరులున్నారు

ความคิดเห็น •