Mepa Telangana | మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిన మెపా | ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్.
    ప్రార్థించే పెదవుల కన్నా
    సహాయం చేసే చేతులు మిన్న
    అన్న మదర్ తెరిసా పదాలు గుర్తుకొస్తున్నాయి అన్నట్లు ముదిరాజ్ లు బియ్యం తీసుకునే స్థాయి నుండి బియ్యం ఇచ్చే స్థాయికి ఎదగాలని మెపా MEPA ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.
    శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, గురిజాల గ్రామానికి చెందిన దండు సాంబయ్య ముదిరాజ్ ఇటీవల అనారోగ్య కారణాలతో బాధపడుతూ మృతి చెందారనీ అతనికి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో వారి పరిస్థితి దీనంగా ఉందనీ ,కనీసం తినడానికి తిండి దొరకని పరిస్థితి ఉందని విషయం తెలుసుకున్న MEPA -మెపా రాష్ట్ర,వరంగల్ జిల్లా, నర్సంపేట డివిజన్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి 50 కేజీ ల బియ్యం మృతుడి కుటుంబానికి మెపా ఆధ్వర్యంలో అందించారు.
    అనంతరం మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి భవిష్యత్ లో ఎల్లవేళలా సహకారం అందిస్తుందనీ ,గురిజాల గ్రామ ముదిరాజ్ కుల సభ్యులకు విద్యా ఆవశ్యకత ను వివరించి పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని,స్థానిక ఎన్నికల లో ముదిరాజ్ ల సత్తాచాటాలని హితబోధ చేసి ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలని అన్నారు.చివరికి సాంబయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి ముదిరాజ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్,నర్సంపేట డివిజన్ నాయకులు దండు శ్రీను ముదిరాజ్,సింగారపు రామకృష్ణ ముదిరాజ్ నీరటి రాజు ముదిరాజ్,గురిజాల సొసైటీ అధ్యక్షులు సున్నపు భిక్షపతి ముదిరాజ్, గ్రామ కుల పెద్ద మనుషులు కొక్కు రామరాజ్,వీర బోయిన సాంబయ్య,ఇప్ప సదానందం, చింతకాయల సాంబయ్య, కంకనాల రాజు ముదిరాజ్, కొక్కు సదానందం,పెండ్యాల మల్లేష్,కుమ్మరికుంట్ల చంద్ర మౌళి,కొక్కు లింగయ్య,తెప్ప నర్సయ్య,కోక్కు సాంబయ్య, ఇప్ప రాజేష్ ముదిరాజ్ లతో పాటు కుటుంబ సభ్యులు పెండ్యాల రమ,సంపత్, సంతోష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు..

ความคิดเห็น •