చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలు నగర మేయర్‌ సురేష్‌బాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలు ఇవ్వడమే కాకుండా నెల రోజుల్లోపే ప్రజలను నిట్ట నిలువునా ముంచుతున్నదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు, నగర మేయర్‌ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
    వాయిస్‌ - కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌బాబు మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం దుష్ప్రచారమేనని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2011 లో జరిగిన కడప పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో కడప దెబ్బకు ఢిల్లీ అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారన్నారు. నాడు వైఎస్‌ జగన్‌ కు వచ్చిన మెజారిటీ చారిత్రాత్మకమన్నారు. నాటి ఎన్నికను దేశమంతా చూశారని, కానీ ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నిక అంటూ తప్పుడు కథనాలు రాయడం, అందుకు రేవంత్‌ స్పందించడం సిగ్గుచేటన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రజలను మభ్య పెట్టి ప్రస్తుత ట్రాక్టర్‌ ఇసుక రూ. 3500 అమ్ముతున్నారన్నారు. ఇందులో రూ.
    1700 ప్రభుత్వానికి చెల్లించేలా, మిగతా మొత్తం ట్రాక్టర్‌ కు వసూలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు ఒక్క చర్య అయినా తీసుకున్నారా? అని అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని తెలిపారు.
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น • 2

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 หลายเดือนก่อน

    ❤Chandrababu అన్ని వాగ్దానాలు నెరవేరుస్తారు... వట్టి మాటలు కట్టిపేట్టు....😂